కోవిడ్ కేర్ సెంటర్ లో ప్రమాదం : ఒకరు మృతి

Telugu Lo Computer
0


చిత్తూరు జిల్లా చంద్రగిరి తొండవాడ  వద్దవున ప్రభుత్వ కొవిడ్ కేర్ సెంటర్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. విద్యుత్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా కోవిడ్ కేర్ సెంటర్ లో పని చేస్తున్న ముగ్గురు సిబ్బందికి విద్యుత్ షాక్ తగిలింది. షాక్ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడిక్కడే ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. మృతుడుని తిరుపతి జీవకోనకు చెందిన ఎం.సుబ్రమణ్యంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రమాదానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆస్పత్రిలో రోగులు.. ప్రమాద బాధిత కుటుంబ సభ్యులు మాత్రం.. ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది అంటున్నారు. కఠిన చర్యలు తీసుకుని.. తమ కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)