జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ భారత మార్కెట్లో తొలిసారి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేసింది. ఈ-ట్రాన్ పేరిట మూడు ఎస్యూవీలను గురువారం విడుదల చేసింది. ఇందులో ఈ-ట్రాన్ 50 ధరను ₹99.99 లక్షలుగా నిర్ణయించగా.. ఈ-ట్రాన్ 55, ఈ-ట్రాన్ స్పోర్ట్బ్యాక్ 55 ధరను ₹1.16 కోట్లు, ₹ 1.18 కోట్లుగా (ఎక్స్షోరూమ్ ధరలు) నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఆడీ ఈ-ట్రాన్ ఎలక్ట్రిక్ కార్లు
July 22, 2021
0