బెంగళూరులోని అత్యంత ఖరీదైన ప్రెస్టీజ్ గోల్ఫ్ అపార్ట్మెంట్స్లో యశ్ ఓ ఇంటిని కొనుగోలు చేసి, గురువారం ఉదయం యశ్ - రాధికా పండిట్ దంపతులు నూతన గృహంలోకి అడుగుపెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నూతన గృహప్రవేశ వేడుకలో యశ్ తల్లిదండ్రులతోపాటు ఇతర కుటుంబసభ్యులు, అత్యంత ఆప్తులు మాత్రమే పాల్గొన్నారు. మరోవైపు, తమ అభిరుచులకు అద్దం పట్టేలా యశ్-రాధిక ఈ ఇంటిని డిజైన్ చేయించుకోనున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా నెట్టింట్లో వైరల్గా మారాయి.