తులసి సాగు

Telugu Lo Computer
0


ఎన్నో జబ్బులను నయం చేయగల తులసి ఇప్పుడు రైతుల ఇంట సిరులను పండిస్తోంది. మహారాష్ట్రకు చెందిన కొందరు రైతులు.. తులసి పంటతో ఏడాదికి రూ.1.83 లక్షల వరకు ఆదాయం ఆర్జిస్తున్నారు. ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని సహకార వ్యవసాయం ద్వారా తులసి సాగు చేస్తున్నారు. నీటి వసతి అంతగాలేని పొలాల్లో తులసి మొక్కలు పెంచి.. రూ.లక్షల ఆదాయం ఆర్జిస్తోంది మహారాష్ట్రలోని ఔరంగబాద్​కు చెందిన 16 మంది రైతుల బృందం. బెంగళూరుకు చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని ఈ మొక్కలను పెంచుతోంది. ఎకరానికి 15,000 నుంచి 18,000 మొక్కలు వేసి.. రూ.70 వేల నుంచి రూ.1.83 లక్షల ఆదాయాన్ని ఆ రైతులు సంపాదిస్తున్నారు.జిల్లాలోని పైఠాన్​ తాలుకాలోని కేకత్​ జల్​గావ్​, కుతుబ్​ఖేడా, దవర్వాడి గ్రామాలు మూడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన ఓ ఫార్మాస్యూటికల్​ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రైతు సందీప్​ కాక్డే తెలిపారు. అప్పటి నుంచి తులసి సాగు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)