కెనడాలో భరించలేని ఎండలు : 500మంది మృతి

Telugu Lo Computer
0

 

కెనడాలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఆల్ టైమ్ రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఓవైపు విపరీతమైన వేడి, మరోవైపు వడగాలులు, వీటి ప్రభావంతో ఇప్పటివరకూ 500 మంది కన్నుమూశారు. దీంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించడంతో పాటు అత్యవసరమైతేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని సూచించారు.

వాంకోవర్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడే సుమారు 135 మంది చనిపోయారు. చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, కరోనా టీకా కేంద్రాలను, స్కూళ్లను మూసివేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ టీకాల పంపిణీ ఉండబోదని అధికారులు తెలిపారు. ఎండ నుంచి ఉపశమనానికి నడి రోడ్లపై టెంపరరీ వాటర్ ఫౌంటెయిన్లు, నీటి జల్లు కేంద్రాలను, పలు ప్రాంతాల్లో కూలింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇక స్విమ్మింగ్ పూల్స్, బీచ్ ల దగ్గర ప్రజలు అధికంగా ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)