జియో ఫైబర్ తన యూజర్ల కోసం అద్బుతమైన ఆఫర్ను ప్రవేశపెట్టింది. కేవలం రూ. 199కే 1టీబీ డేటా (1000జీబీ)ను జియోఫైబర్ అందిస్తోంది. యూజర్లకు ఈ డేటా సాచెట్ ట్యాక్స్తో కలిపి రూ.234.82 రానుంది. కాగా డేటా ప్యాక్ వ్యాలిడిటీ కేవలం ఏడు రోజులు మాత్రమే. 1 టీబీ డేటా 100ఎమ్బీపీఎస్ స్పీడ్తో యూజర్లకు అందుబాటులో ఉండనుంది. డేటా ప్యాక్ ముగిసిన తర్వాత 1ఎమ్బీపీఎస్ స్పీడ్ వస్తుంది. అయితే వారి ప్లాన్ ఆఫర్ చేసిన ఎఫ్ యూపీ డేటా పూర్తిగా వినియోగించిన తర్వాత ఈ ప్లాన్ ను కొనే అవకాశం ఉంటుంది.