మొదటి భర్త సహకారంతోనే మోసాలు!

Telugu Lo Computer
0


అనాథ‌నని చెప్పి ప్రేమ పేరుతో పలువురిని వివాహం చేసుకొంటున్న సుహాసిని అసలు గుట్టు బట్టబయలైంది. సుహాసిని మొద‌టి భ‌ర్త స‌హ‌కారంతోనే ఇలా మోసాల‌కు పాల్ప‌డుతోంద‌ని తెలిసింది. సుహాసిని వ‌ల్ల తాను న‌ష్ట‌పోయానంటూ ఆమె రెండో భ‌ర్త విన‌య్ ఆదివారం ఒక వీడియో విడుదల చేశాడు.  నాకు 2018లో సుహాసిని ప‌రిచ‌యం అయ్యింది. అనాథ అని చెప్పింది. నేనంటే ఇష్టం అని పెళ్లి చేసుకుందామ‌నే ప్రతిపాద‌న పెట్టింది. 2019లో ఆమెను వివాహం చేసుకున్నా. మా కుటుంబ స‌భ్యుల‌తో మంచిగా న‌టించి ప‌లువురి నుంచి రూ.10 ల‌క్ష‌లు తీసుకుంది. రెండు నెల‌ల తరువాత ఆమె ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌చ్చింది. అంత‌కు ముందే సుహాసిని త‌న మేన‌మామ‌ అంటూ నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాళేనికి చెందిన మొద‌టి భ‌ర్త‌ని నాకు పరిచ‌యం చేసింది. త‌న ఇద్ద‌రు పిల్ల‌ల‌నే మేన‌త్త పిల్ల‌ల‌ని న‌మ్మించింది. ఆమె ప్ర‌వ‌ర్త‌న‌పై అనుమానం రావ‌డంతో వివ‌రాలు ఆరా తీయ‌గా నాకు మేన‌మామ‌గా ప‌రిచ‌యం చేసిన వ్య‌క్తే సుహాసిని భ‌ర్త అని, ఆ పిల్ల‌లు వారికే పుట్టిన‌ట్లు తెలిసింది. పోలీసుల‌కు ఫిర్యాదు చేసినా స్పందించ‌లేదు. ఆ మ‌రుస‌టి రోజే ఆమె మా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ స‌మ‌యంలో సుమారు రూ.5ల‌క్ష‌ల విలువ చేసే బంగారం తీసుకెళ్లింది. మ‌రోసారి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా పట్టించుకోకపోవడంతో ఆమె మోసాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పాడు. తిరుపతిలో మూడో పెళ్లి విషయం వెలుగులోకి రావడంతో మీడియా ముందుకు వచ్చానని వినయ్‌ తెలిపాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)