లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా ఫామ్ హౌస్లో పెద్ద ఎత్తున మద్యం తాగుతూ అంతా కలిసి చిందులు వేస్తూ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్న పలువురి యువతీ, యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులతో సహా 67 మందిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ వరుణ్గౌడ్ నిబంధనలకు విరుద్ధంగా జన్మదిన వేడుకలను జరుపుకున్నాడు. దీనిలో హైదరాబాద్లోని వివిధ కంపెనీలకు చెందిన సుమారు 70 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారు.
కడ్తాల్ ఎస్ ఐ సుందరయ్య ఆధ్వర్యంలో ఫాంహౌస్పై రాత్రి 11.30 గంటలకు దాడులు నిర్వహించారు. వరుణ్గౌడ్ పారిపోగా.. ముగ్గురు నిర్వాహకులు, 21 మంది యువతులు, 43మంది యువకులను అరెస్టు చేశారు. 47 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. కందుకూరు మండలం రాచులూరుకి చెందిన ఫాంహౌస్ యజమాని భరత్ ఏ-1, నిర్వాహకులు మెహిదీపట్నానికి చెందిన జిషాన్ అలీఖాన్ ఏ-2, ఎస్ఆర్నగర్కు చెందిన అన్వేష్ ఏ-3, పరారీలో ఉన్న వరుణ్గౌడ్పై ఏ-4గా కేసు నమోదు చేశారు.