నిర్మాత కళ్యాణ్ పై కేసు నమోదు

Telugu Lo Computer
0


సినీ నిర్మాత సి కల్యాణ్‌, మరో ముగ్గురిపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు తెలిపి వివరాల ప్రకారం అమెరికాలో నివసించే స్వరూప్ అనే వైద్యుడు 1985లో హైదరాబాద్ షేక్ పేట్ లో ఉన్న 634 గజాల స్థలం ఫిలిం నగర్ కో ఆపరేట్ హౌసింగ్ సొసైటీ నుంచి కొనుగోలు చేసి, అనంతరం తన సోదరుడు గోపీకృష్ణ పేరు మీద జిపిఏ చేశారు. ఈ క్రమంలో అక్రమంగా తన భూమిలోకి ప్రవేశించి బెదిరిస్తున్నారని ఫిల్మ్‌నగర్‌కు చెందిన గోపీకృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. సి కల్యాణ్‌ పేరుతో షారుప్‌, శ్రీకాంత్‌, తేజస్వీ అనే ముగ్గురు వ్యక్తులు దౌర్జన్యం చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)