ట్రాన్స్ జెండర్ల కోసం స్కూల్!

Telugu Lo Computer
0

 


మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో ట్రాన్స్ జెండర్స్ కి ఉచిత విద్యను అందించేందుకు పాఠశాలను ఏర్పాటు చేశారు. ట్రాన్స్ జెండర్స్ సమాజంలో అక్షరాస్యత చాలా తక్కువగా ఉంది. వారు ఎక్కడికైనా వెళ్లి చదువుకోవాలంటే అనేక రకాల ఇబ్బందులను  దృష్టిలో పెట్టుకొని ఓ ఎన్జీఓ  ముందుకు వచ్చి వీరి కోసం ప్రత్యేకంగా పాఠశాలను నిర్మించింది. ఈ పాఠశాలలో పెద్దలు, పిల్లలు కలిసి 25 మంది చేరినట్లు పాఠశాల నిర్వాహకులు తెలిపారు. తమకు చదువుకోవాలని ఉన్నా పాఠశాలకు వెళ్లలేకపోతున్నామని, తమకు చదువు చెప్పేందుకు ఎవరు ముందుకు రావడం లేదని తెలిపారు. తమ బాధలని ఓ ఎన్జీఓకి తెలిపామని వారు తమకోసం ఈ పాఠశాల ఏర్పాటు చేశారని చెప్పారు. 

ఎన్జీఓ వ్యవస్థాపకులు, చైర్‌పర్సన్ రేఖా త్రిపాఠి మాట్లాడుతూ లింగభేదం లేకుండా అందరికి విద్యను అందించాలని తెలిపారు. ఆలా అందించినప్పుడే సమాజంలో అందరికి గౌరవం దక్కుతుందని, చాలా చోట్ల ట్రాన్స్ జెండర్స్ ని పాఠశాలలోకి రానివ్వడం లేదని వారిని చిన్న చూపుచూస్తున్నారని, ఇకపై అనేక చోట్ల ఇటువంటి పాఠశాలలు ప్రారంభిస్తామని వివరించారు. ప్రభుత్వాలు వారికోసం పాఠశాలలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని  కోరారు. ఈ పాఠశాలలో వయసుతో సంబంధం లేకుండా ట్రాన్స్ జెండర్స్ ఎవరైనా వచ్చి చదువుకోవచ్చని ఆమె తెలిపారు.


إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)