పీవీ విగ్రహావిష్కరణ
June 28, 2021
0
నెక్లెస్ రోడ్డులో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 26 అడుగుల ఎత్తు కాంస్య విగ్రహాన్ని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం వారు పీవీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అంతకు ముందు పీవీ మార్గ్ను గవర్నర్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నెక్లెస్ రోడ్కు పీవీ మార్గ్గా నామకరణం చేసింది.ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు అధికారులు పాల్గొన్నారు.