మరింత ముదిరిన జల వివాదం

Telugu Lo Computer
0


తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదిరింది. జల వివాదం కాస్త విద్యుత్ వివాదంగా మారుతోంది. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధించిన ఎడమ విద్యుత్ కేంద్రానికి నీటిని నిలిపివేయాలని ఏపీ సర్కార్ ఇటీవల లేఖ రాసింది. ఏపీ లేఖకు స్పందిస్తూ తక్షణమే ఎడమ విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. రాష్ట్రంలో ఉన్న జల విద్యుత్ ద్వారా 100 శాతం ఉత్పత్తి చేయాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. టీఎస్ జెన్‌కో తీసుకోబోయే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)