ఐదుగురు దారుణ హత్య !
يونيو 30, 2021
0
అయోధ్య జిల్లా మల్కిపుర్ తాలుకాలోని బారియా నిశారు గ్రామంలో రమేష్ కుమార్(35) అనే వ్యక్తి తన మేనల్లుడితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. అయితే మామా అల్లుడి మధ్య చాలా రోజులుగా ఓ భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. శనివారం రాత్రి రమేష్ కుమార్, అతడి భార్య జ్యోతి సహా వారి కుమార్తె, ఇద్దరు కుమారులను రమేశ్కుమార్ మేనల్లుడు గొంతుకోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు. ఈ హత్యల సమాచారం అందుకుని జిల్లా మేజిస్ట్రేట్ అనూజ్ కుమార్ ఝా, ఎస్ఎస్పీ శైలేశ్ పాండే, ఎస్పీ శైలేంద్ర సింగ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు బృందాలు గాలిస్తున్నాయని ఎస్ఎస్పీ శైలేష్ కుమార్ పాండే తెలిపారు.