ఐదుగురు దారుణ హత్య !

Telugu Lo Computer
0


అయోధ్య జిల్లా​ మల్కిపుర్​ తాలుకాలోని బారియా నిశారు గ్రామంలో రమేష్​ కుమార్(35)​ అనే వ్యక్తి తన మేనల్లుడితో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తుంటారు. అయితే మామా అల్లుడి మధ్య చాలా రోజులుగా ఓ భూమి విషయంలో తగాదాలు ఉన్నాయి. శనివారం రాత్రి రమేష్​ కుమార్​, అతడి భార్య జ్యోతి సహా వారి ​ కుమార్తె, ఇద్దరు కుమారులను రమేశ్​కుమార్​ మేనల్లుడు గొంతుకోసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. అనంతరం అతడు అక్కడి నుంచి పరారయ్యాడని చెప్పారు. ఈ హత్యల సమాచారం అందుకుని జిల్లా మేజిస్ట్రేట్​ అనూజ్​ కుమార్​ ఝా, ఎస్​ఎస్​పీ శైలేశ్​ పాండే, ఎస్పీ శైలేంద్ర సింగ్​ ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని పట్టుకునేందుకు ఐదు బృందాలు గాలిస్తున్నాయని ఎస్​ఎస్​పీ శైలేష్​ కుమార్​ పాండే తెలిపారు. 

إرسال تعليق

0تعليقات

إرسال تعليق (0)