కోవిడ్ చికిత్స కోసం లోన్ !

Telugu Lo Computer
0

     


దేశీయ అతి పెద్ద బ్యాంక్ అయిన  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు తీపికబురు అందించింది. 8.5% వడ్డీతో  పర్సనల్ లోన్ అందిస్తోంది. అర్హత కలిగిన వారు వ్యక్తిగత రుణాల కింద రూ.5 లక్షల వరకు పొందవచ్చు.రుణం  పొందడానికి ఎలాంటి తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. 

              కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎస్‌బీఐ ఇలాంటి స్కీమ్ తీసుకురావడం గమనార్హం. బ్యాంక్ ఈ రుణాలకు కోవిడ్ పర్సనల్ లోన్స్ అని పేరు పెట్టింది. మీరు వేతన జీవులు, పెన్షన్ పొందే వారు, స్వయం ఉపాధి పొందుతున్న వారు ఈ తరహా రుణాలు తీసుకోవచ్చు. కనీసం రూ.25 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు రుణం పొందవచ్చు. తీసుకున్న రుణాన్ని 5 ఏళ్లలోపు తిరిగి చెల్లించాలి.  కోవిడ్ 19 చికిత్స కోసం లోన్ పొందొచ్చు. దీని కోసం మీరు హాస్పిటల్ బిల్లులు చూపించాల్సి ఉంటుంది. అలాగే మీ రీపేమెంట్ సామర్థ్యం, ఇరత అర్హతల ప్రాతిపదికన రుణ మంజూరీ ఆధారపడి ఉంటుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)