రాగల మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు
June 06, 2021
0
వచ్చే 24 గంటలలో నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలలో విస్తరించే అవకాశం ఉంది. వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం డైరెక్టర్ వెల్లడించారు. నైరుతి రుతు పవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వాతావరణంలో పలు మార్పులు వస్తాయని అధికారులు వెల్లడించారు. ఉత్తర కోస్తాలో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. అలాగే కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.