శ్రీశైలంలో తామ్ర శాసనాలు లభ్యం !

Telugu Lo Computer
0


చారిత్రక ప్రసిద్ధి గాంచిన శైవక్షేత్రం శ్రీశైలంలో మరో అద్భుత ఘటన వెలుగుచూసింది. శ్రీశైలంలో జరుపుతున్న తవ్వకాల్లో తామ్ర శాసనాలు లభ్యం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. శ్రీశైలంలోని ఘంటామఠం వద్ద పునరుద్ధరణ పనులు జరుగుతున్న సమయంలో మరోసారి ప్రాచీన కాలం నాటి తామ్ర శాసనాలు బయటపడ్డాయి. పద్దెనిమిది రాగి శాసనాలు బయల్పడిన విషయం తెలుసుకున్న ఆలయ ఈవో రామారావు, సిబ్బంది ఘంటామఠం వద్దకు చేరుకున్నారు. తామ్ర శాసనాలను పరిశీలిస్తున్నారు._

గతంలో ఇదే ఘంటామఠం సమీపంలోని చిన్న శివాలయం పునరుద్ధరణ పనుల్లో రాగి శాసనాలు, వెండి నాణేలు లభ్యమయ్యాయి. ఇటీవల శ్రీశైలం తవ్వకాల్లో కొన్ని ప్రాచీన రాతి శాసనాలు కూడా బయటపడ్డాయి. అవి శ్రీశైలం చరిత్రకు ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)