యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ (యూనిసెఫ్) ఇండియా నేషనల్ అంబాసిడర్గా బాలీవుడ్ నటి కరీనా కపూర్ను నియమించారు. గత పదేళ్లుగా కరీనాకు యూనిసెఫ్తో అనుబంధం ఉంది. 2014 నుంచి ఆమె యూనిసెఫ్ సెలెబ్రిటీ అడ్వకేట్గా కొనసాగుతున్నారు. నూతన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కరీనా ఉద్వేగంతో ప్రసంగించారు. తనను యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా నియమించడం చాలా గర్వంగా ఉందని కరీనాకపూర్ చెప్పారు. దేశంలోని మహిళలు, పిల్లల హక్కుల కోసం పోరాటం చేస్తున్న బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కరీనా కపూర్ నేషనల్ అంబాసిడర్గా ఎన్నికవడంతో యూనిసెఫ్ ఇండియాలో కొత్త ఉత్సాహం నిండిందని యూనిసెఫ్లో భారత ప్రతినిధి సింథియా మెక్కాఫ్రే అన్నారు.
'యూనిసెఫ్' ఇండియా నేషనల్ అంబాసిడర్గా కరీనా కపూర్
May 04, 2024
0
Tags