నాలుగు రోజుల్లో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం !

Telugu Lo Computer
0


తెలంగాణలో భానుడి భగభగలకు, వడగాలులకు జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నేటి వరకు రాష్ట్రంలో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మరో నాలుగు రోజుల్లో 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ  వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచే భానుడు నిప్పులు కక్కుతున్నాడు. దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మండుటెండలకు తోడు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణలోని పలు జిల్లాల్లో రెడ్‌ అలెర్ట్‌, మరికొన్ని జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌లు కొనసాగుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)