శ్రీవారికి అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అందజేత !

Telugu Lo Computer
0


చెన్నైకి చెందిన అశోక్‌ లేలాండ్‌ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రెసిడెంట్ శ్రీ సంజీవ్ కుమార్ రూ.31.31 లక్షల విలువైన లారీని టీటీడీ అధికారులకు అందచేసారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట కొత్త వాహనానికి పూజలు నిర్వహించి, తాళాలను ఈవో ఏవి ధర్మారెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జిఎం శేషా రెడ్డి, తిరుమల డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ ఉంది. తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారి దర్శనానికి 30 కంపార్టుమెంట్స్ లో వేచియున్నారు. శుక్రవారం నాడు స్వామివారిని 62,624 మంది భక్తులు దర్శించుకోగా., 32,638 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 2.96 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలియచేసారు.

Post a Comment

0Comments

Post a Comment (0)