ఆంధ్రప్రదేశ్ లోని గుడివాడలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారింది. అక్కడ కొడాలి నాని తన గెలుపు పైన ధీమాగా ఉన్నారు. కొడాలి నాని పైన పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్ది వెనిగళ్ల రాముకు మద్దతుగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారం చేసారు. ముఖ్యమంత్రి జగన్, కొడాలి నాని లక్ష్యంగా పవన్ విరుచుకుపడ్డారు. జగన్.. నువ్వంటే నాకు భయంలేదు.. దమ్ముంటే నా సినిమాలు ఆపితే ఆపుకో అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జగన్ ఇచ్చిన మాటల్లో ఏ ఒక్కటి నిలబెట్టుకోలేదని వైసీపీకి ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో దీపమే అని ఆయన అన్నారు. స్థానిక అంశాల పైన పవన్ స్పందించారు. ఎవరైనా చెరువులు తవ్విస్తారు.. కానీ వీళ్లు కబ్జా చేశారన్నారు. బూతులు తిట్టేవాళ్లను, గోతులు తవ్వేవాళ్లను సాగనంపాలన్నారు. రాజకీయ నేతల బూతులు, దాడులకు పన్ను వేస్తే నిధులకు కొరతే ఉండదని వ్యాఖ్యానించారు. ఇంట్లో ఉన్నవాళ్లను కూడా వ్యక్తిగతంగా దూషిస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం.. దాడులు, దోపిడీలు, బూతులు తప్ప చేసిందేమీ లేదన్నారు. జగన్ ను చూసి, వైకాపా నాయకులను చూసి భయపడాలా అని ప్రశ్నించారు. జగన్ అంటే తనకు భయం లేదని చెప్పారు. మన నేలను విడిచి ఎక్కడికి పారిపోతాం, మీ గుండెల్లో ధైర్యం నింపడానికే నేనొచ్చా. మాటిస్తే ప్రాణాలు పోవాలిగానీ, వెనక్కి తీసుకోకూడదని పవన్ కల్యాణ్ అన్నారు. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరును మార్చాల్సిన అవసరమేమొచ్చిందంటూ జగన్ పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తనకు ముఖ్యమని, స్వేచ్ఛ పోయినరోజు ఎన్ని వేల రూ. కోట్లున్నా నిష్ర్పయోజనమే అని ఆయన అన్నారు. చంద్రబాబు బలమైన నాయకుడని , జైలులో ఉన్నా కూడా ఆయన ఏ మాత్రం తొణకలేదన్నారు. అలాంటి వ్యక్తికి అండగా ఉండాలని ఆనాడే నిర్ణయించుకున్నానని పవన్ చెప్పారు
బూతులు తిట్టే వాళ్లను, గోతులు తవ్వే వాళ్లను సాగనంపాలి !
May 04, 2024
0
Tags