కాంగ్రెస్ ఢిల్లీ విభాగం అధ్యక్ష పదవికి గత వారంలో రాజీనామా చేసిన అర్విందర్ సింగ్, మరో నలుగురు కాంగ్రెస్ నేతలతో కలిసి బీజేపీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర మంత్రి హర్దీద్ సింగ్ పూరీ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆయనతో పాటు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యేలు రాజ్ కుమార్ చౌహాన్, నసీబ్ సింగ్, నీరజ్ బసోయ, యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అమిత్ మల్లిక్ బీజేపీలో చేరారు. 'ఇండియా' కూటమిలో భాగంగా ఆప్తో కాంగ్రెస్ సీట్లు పంచుకోవడంపై అసంతృప్తి ప్రకటిస్తూ లవ్లీ గతవారంలో తన పదవికి రాజీనామా చేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి కన్హయ్య కుమార్, వాయవ్య ఢిల్లీ నుంచి ఉదిత్ రాజ్ అభ్యర్థిత్వంపై ఆయన విమర్శలు గుప్పించారు. వారు పూర్తిగా ఢిల్లీకి అపరిచితులని. టిక్కెట్ కోసం తాను రాజీనామా చేయలేదని లవ్లీ అప్పట్లో వివరణ ఇచ్చారు. తాను పార్టీ పదవికే కానీ, పార్టీకి రాజీనామా చేయలేదన్నారు.
బీజేపీలో చేరిన అర్విందర్ సింగ్ !
May 04, 2024
0
Tags