ఢిల్లీలోని లోక్‌సభ స్థానాల్లో సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం !

Telugu Lo Computer
0


దేశ రాజధాని ఢిల్లీలోని లోక్‌సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆమ్ ఆద్మీ పార్టీ  నిర్ణయించింది. ఆ క్రమంలో ఆయా లోక్‌సభ స్థానాల్లో ఆప్ విజయకేతనం ఎగురవేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించనుంది. అందుకోసం ఆప్ ప్రధాన కార్యాలయంలోని వార్ రూమ్‌లో ఆ పార్టీ ఢిల్లీ కన్వీనర్, సీనియర్ నేత గోపాల్ రాయ్ ప్రారంభించారు. అనంతరం గోపాల్ రాయ్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రచార నిర్వహణ, న్యాయ పరమైన పనులు, డేటా మేనేజ్‌మెంట్, అనాలసిస్, మీడియా, సోషల్ మీడియాలో పార్టీ ప్రచార నిర్వహణతోపాటు అభ్యర్థులు గెలుపు తదితర అంశాలపై చర్చిస్తామన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో డిల్లీలో కాంగ్రెస్ పార్టీతో ఆప్ కలిసి వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని మొత్తం 7 లోక్‌సభ స్థానాల్లో నాలుగు ఆప్ తన అభ్యర్థులను బరిలో దింపింది. మరో 3 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఆప్ అభ్యర్థులు బరిలో దిగే న్యూఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ నియోజకవర్గాలకు ఇన్ చార్జీగా గోపాల్ రాయ్ వ్యవహరిస్తున్నారు. అలాగే ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీతోపాటు చాందీని చౌక్‌ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థులను రంగంలోకి దింపింది. ఈ లోక్ సభ ఎన్నికలు మొత్తం 7 దశల్లో జరుగుతున్నాయి. అయితే ఆరో దశ.. అంటే మే 25వ తేదీన ఢిల్లీలోని లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)