దుర్గి నుండి విశాఖపట్నం వరకు వందే భారత్ రైలు !

Telugu Lo Computer
0


త్తీస్ ఘడ్ లోని దుర్గి నుండి విశాఖపట్నం వరకు ఈ రైలు నడవనుంది. త్వరలోనే ప్రారంభం కానున్న ఈ వందే భారత్ రైలు దుర్గిలో ఉదయం 6 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల 30నిమిషాలకు విశాఖకు చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు విశాఖలో మధ్యాహ్నం 3 గంటల 15నిమిషాలకు ప్రారంభమై రాత్రి 11గంటల 50 నిమిషాలకు దుర్గి చేరుకుంటుంది. విశాఖ నుండి విజయనగరం, పార్వతీపురం, రాయగడ, సింగపూర్ రోడ్, కేసింగ, తిట్లాగర్, కంటబన్జీ, ఖారియార్ రోడ్, లఖోలి, రాయపూర్ మీదుగా దుర్గి చేరుకుంటుంది. ఈ రైలు భిలాయ్, చరోదా, కుమ్హరి, రాయపూర్ ప్రాంతాల్లో నివసించే తెలుగువారికి చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం విశాఖపట్టణం, దుర్గ్ మధ్య ఉన్న 48స్టేషన్లు, 16 గంటల దూరాన్ని ఈ వందే భారత్ రైలు 11స్టేషన్లు, 8గంటలకు కుదించనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)