సూర్జేవాలాకు ఈసీ షోకాజ్‌ నోటీసులు !

Telugu Lo Computer
0

                                         

భాజపా ఎంపీ, సినీ నటి హేమమాలినిపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సూర్జేవాలాకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ ప్రసంగాల సమయంలో మహిళల గౌరవాన్ని కాపాడేందుకు తమ సలహాలను కచ్చితంగా పాటించేలా తీసుకున్న చర్యలేంటో వివరించాలని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కోరింది. నేతలిద్దరూ తమ స్పందనలను తెలపాలని ఈసీ సూచించింది. సూర్జేవాలా ఏప్రిల్ 11 సాయంత్రంలోపు స్పందించాలని ఆదేశించిన ఈసీ.. ఖర్గేకు మరుసటి రోజు సాయంత్రం వరకు గడువు ఇచ్చింది. మరోవైపు, హేమమాలినిని అవమానించి, బాధపెట్టాలని తాను ఎన్నడూ అనుకోలేదని, తేదీ లేని వీడియోను ఎడిట్‌ చేసి వక్రీకరించారని సూర్జేవాలా అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)