ముంబైలో రీల్‌ కోసం రైల్వే స్టేషన్‌ వద్ద మహిళ బెల్లీ డ్యాన్స్‌ !

Telugu Lo Computer
0


ముంబైలో సోషల్‌ మీడియాలో పాపులర్‌ అయ్యేందుకు చాలా మంది తంటాలు పడుతుంటారు. ఇందులో భాగంగా ఒక మహిళ ఏకంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్‌ వద్ద బెల్లీ డ్యాన్స్‌ చేసింది. ప్రయాణికులు నడిచి వెళ్లే ఫుట్‌పాత్‌పై రీల్‌ చేసింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ఆమెపై విమర్శలు వెల్లువెత్తాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్‌ఎంటీ) స్టేషన్ బయట ఒక మహిళ బెల్లీ డ్యాన్స్‌ చేసింది. రీల్‌ షూటింగ్‌ కోసం ప్రయాణికులు నడిచి వెళ్తే ఫుట్‌పాత్‌ను ఆమె ఆక్రమించింది. కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో రద్దీగా ఉండే సీఎస్‌ఎంటీ ఫుట్‌పాత్‌ను రీల్‌ కోసం ఆమె వినియోగించడంపై నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పటికే వీధి వ్యాపారులు ఆ ఫుట్‌పాత్‌ను చాలా వరకు ఆక్రమించారని ఆరోపించారు. ఇలాంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేశారు. ముంబైకి ఈ (రీల్‌) రోగం చేరిందని మరొకరు కామెంట్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)