రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ను శ్రీలంక క్లీన్ స్వీప్ చేసింది. ఇవాళ ముగిసిన రెండో టెస్ట్లో రీలంక 192 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్తో పాటు సిరీస్ ఆధ్యాంతం అద్భుతంగా రాణించిన యువ ఆల్రౌండర్ కమిందు మెండిస్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలుచుకున్నాడు. కమిందు ఈ సిరీస్లో నాలుగు ఇన్నింగ్స్ల్లో 122.33 సగటున రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 367 పరుగులు చేశాడు. అలాగే మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 531 పరుగులకు ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్లో ఏకంగా ఆరుగురు లంక ఆటగాళ్లు అర్దసెంచరీలు చేశారు. ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ కూడా నమోదు కాకుండా టెస్ట్ల్లో చేసిన అత్యధిక స్కోర్ ఇదే. లంక ఇన్నింగ్స్లో నిషన్ మధుష్క (57), కరుణరత్నే (86), కుశాల్ మెండిస్ (93), చండీమల్ (59), ధనంజయ డిసిల్వ (70), కమిందు మెండిస్ (92 నాటౌట్) అర్దసెంచరీలతో రాణించారు. బంగ్లా బౌలర్లలో షకీబ్ 3 వికెట్లు పడగొట్టగా.. హసన్ మెహమూద్ 2, ఖలీద్ అహ్మద్, మెహిది హసన్ మీరజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.
టెస్ట్ సిరీస్ లో బంగ్లాదేశ్ను క్లీన్ స్వీప్ చేసిన శ్రీలంక
April 03, 2024
0
Tags