ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరైనా పాఠశాలలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ దీనిని తూచా తప్పకుండా పాటించాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వీలైనంత టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నెలఖారులో వాల్యుయేషన్‌ పూర్తి చేయాలని చూస్తున్నారు. ఇక పరీక్షా ఫలితాలను వచ్చే నెల చివరి వారంలో విడుదల చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)