భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తాపడి 21 మందికి గాయాలు !

Telugu Lo Computer
0


హిమాచల్ ప్రదేశ్‌లో భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో అందులో 52 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 52 మందితో వెళ్తున్న ఓ బస్సు కాంగ్రా టన్నెల్ సమీపంలోకి రాగానే బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆర్పీజీఎంసీ తండాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా వారంతా క్షేమంగానే ఉన్నారని అధికారులు చెప్పారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సును సీజ్ చేశామని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ కాంగ్రా షాలిని అగ్ని హోత్రి చెప్పారు. హరియాణాలో ఇటీవల జరిగిన స్కూల్ బస్సు ప్రమాదంలో 6 మంది చిన్నారులు మృతి చెందారు. 15 మందికిపైగా గాయపడ్డారు. డ్రైవర్ మద్యం తాగి ఉన్నట్లు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. గత వారం ఆగ్రా-ఢిల్లీ జాతీయ రహదారి 44పై మధ్యప్రదేశ్‌లోని మొరెనా జిల్లా వద్ద బాలాజీ ఆలయానికి వెళ్తున్న ఓ బస్సు బోల్తా పడడంతో 30 మంది గాయపడ్డారు.


Post a Comment

0Comments

Post a Comment (0)