ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ పాల్పడుతున్న16 మంది అరెస్ట్ !

Telugu Lo Computer
0


హైదరాబాద్‌ నగరంలో ఆన్‌లైన్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ గుట్టురట్టైంది. సైబరాబాద్‌ పరిధిలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన బుకీ నరసారావుపేటకు చెందిన రామాంజనేయులుగా గుర్తించారు. రామాంజనేయులతో పాటు 15 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి 3 కోట్ల 29 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులకు సంబంధించిన 57 బ్యాంక్ ఖాతాల్లోని 2 కోట్ల రూపాయలు ఫ్రీజ్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)