రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తనను రాజ్యసభకు నామినేట్ చేయడంపై ప్రముఖ విద్యావేత్త, ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి స్పందించారు. ‘ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. నన్ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజ్యసభకు నామినేట్ చేయడాన్ని అదృష్టంగా, గౌరవంగా భావిస్తున్నా అని పేర్కొన్నారు. మన దేశానికి సేవ చేసే అవకాశమిచ్చిన మీకు రుణపడి ఉంటా’ అని సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు. దీనికి ‘పరోపకారార్థం ఇదం శరీరం’ అన్న సూక్తిని ఆమె జత చేశారు.
నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపిన సుధామూర్తి
March 08, 2024
0
Tags