జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పార్లమెంట్ అభ్యర్థిని ప్రకటించారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీకి 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలను కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దాదాపు 16 అసెంబ్లీ స్థానాలకు పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించేసిన సంగతి తెలిసిందే. మిగిలిన అభ్యర్థులను త్వరలో ప్రకటించబోతున్నారు. ఇకపోతే ఎంపీల విషయానికి వస్తే ఒకటి మచిలీపట్నం కాగా, రెండోది కాకినాడ. కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న తరుణంలో పవన్ కల్యాణ్ కాకినాడ లోక్సభ అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్(బాలు)ను ప్రకటించారు. ప్రస్తుతం పిఠాపురం ఇన్చార్జిగా ఉన్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తనకు సోదరుడు లాంటి వాడు అని జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ కోసం.. తన కోసం ఎన్నో త్యాగాలు చేశారు అని కొనియాడారు. కూటమి శ్రేణులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గెలుపునకు సహకరించాలని పవన్ కల్యాణ్ కోరారు.
కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ !
March 20, 2024
0
Tags