బీఎస్పీకి హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ ఎంపీ సీట్లు కేటాయింపు !

Telugu Lo Computer
0


తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (భారాస), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు జరిగింది. బీఎస్పీకి 2 ఎంపీ సీట్లను కేటాయిస్తూ భారాస నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ స్థానాలను వారికి ఇచ్చింది. నాగర్‌కర్నూల్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీఎస్పీకి 2 కేటాయించడంతో మిగిలిన 15 చోట్ల భారాస పోటీ చేయనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)