రేవంత్ రెడ్డి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం !

Telugu Lo Computer
0


శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ముంబాయి వెళ్లాల్సిన ఇండిగో విమానం (6E5099) ఇంజన్ లో ఓవర్ హీట్ సమస్య రావడంతో విమానం బయలుదేరడం అలస్యం అయింది. అదే విమానంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, దీపా దాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇంకా ప్రముఖులు ఉన్నారు. ముంబై వెళ్లేందుకు వారు ఆ విమానం ఎక్కారు. ముంబైలో రాహుల్ న్యాయ్ యాత్ర సభకు వెళ్లేందుకు విమానం ఎక్కగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో గంట నుంచి విమానంలోనే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉండిపోయారు. ఇక కాసేపటి క్రితమే సాంకేతిక సమస్యలను పునరుద్దరించడంతో ముంబై బయల్దేరినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)