సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులకు అండగా ఉంటాం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కొమురం భీం జిల్లా కాగజ్ నగర్‌లో సిర్పూర్ పేపర్ మిల్లు కార్మికులతో కిషన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, పాయల్ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ యాజమాన్యాన్ని ఢిల్లీకి పిలిపించి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. మాయ మాటలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అన్నారు. మోడీ హయంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని తెలిపారు. ప్రపంచ దేశాలను శాసించే స్థాయికి భారత్ చేరుకుందని అన్నారు. మత కల్లోలాలు, ఉగ్ర దాడులు, కాశ్మీర్లో అరాచకాలకు మోదీ చరమ గీతం పాడారని చెప్పారు. 370 ఆర్టికల్ రద్దుతో కశ్మీర్ ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దొంగ నోట్ల కట్టడి, పెద్ద నోట్ల రద్దుతో పాకిస్థాన్ దివాలా తీసిందన్నారు. జాతీయం రహదారుల విస్తరణతో ఉత్పత్తి రంగం వృద్ధి చెందుతోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)