టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డును అందుకున్నాడు. టెస్టు క్రికెట్లో 500 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదించాడు. రాజ్కోట్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో అతడు ఈ ఘనత సాధించాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ జాక్ క్రాలీ(15)ని ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఈ మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరుపున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. ఓవరాల్గా తొమ్మిదో ఆటగాడిగా నిలిచాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో 800 వికెట్లతో శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తరువాత ఆసీస్ లెజెండ్ షేన్ వార్న్, ఇంగ్లాండ్ వెటరన్ ఆటగాడు జేమ్స్ అండర్సన్ లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.
టెస్టుల్లో 500 వికెట్ల క్లబ్లో రవిచంద్రన్ అశ్విన్
February 16, 2024
0
Tags