ఉత్తర ప్రదేశ్ లో కస్గంజ్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడింది. శనివారం ఉదయం.. భక్తులతో నిండిన ట్రాక్టర్ వెళ్తుంది. ఈక్రమంలో ఒక్కసారిగా పటియాలీ-దరియావ్గంజ్ రహదారిలోని చెరువు వద్ద అదుపు తప్పి నీళ్లలోకి పడిపోయింది. దీంతో ఒక్కసారిగా అరుపులు, కేకలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఈ ప్రమాదంలో ఏడుగురు పిల్లలు, ఎనిమిది మంది మహిళలు చనిపోయారు. ఘటనా స్థలంలో స్థానికులు, పోలీసులు చేరుకున్నారు. మృతుల్లో ఎనిమిది మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన పలువురు భక్తులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలం నుంచి జిల్లా ఆస్పత్రి వరకు గందరగోళ వాతావరణం నెలకొంది.
ట్రాక్టర్ బోల్తా పడి15 మంది దుర్మరణం !
February 24, 2024
0
Tags