చైనా పరిశోధన నౌకపై మాల్దీవులు ధృవీకరణ

Telugu Lo Computer
0


చైనా పరిశోధక నౌక తమ దేశానికే వస్తున్నట్లు మాల్దీవులు ధృవీకరించింది. ఫిబ్రవరి ప్రారంభంలో రాజధాని మాలె తీరంలో లంగరు వేస్తుందని తెలిపింది. చైనా నుంచి ఈ మేరకు అభ్యర్థన వచ్చినట్లు పేర్కొంది. ఇక్కడ ఉన్నప్పుడు ఆ నౌక ఎలాంటి పరిశోధన కార్యకలాపాలు నిర్వహించదని చెప్పింది. భారత్‌- మాల్దీవుల మధ్య వివాదం నెలకొన్న వేళ.. ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. ''మాల్దీవులు ఎల్లప్పుడూ స్నేహపూర్వక దేశాల నౌకలకు గమ్యస్థానంగా ఉంది. శాంతియుత ప్రయోజనాల కోసం పౌర, సైనిక నౌకలకు ఆతిథ్యం ఇస్తూనే ఉంటుంది. ఇటువంటి చర్యలు.. మా భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుస్తాయి. మిత్ర దేశాల ఓడలను స్వాగతించే శతాబ్దాల నాటి సంప్రదాయాన్ని చాటుతాయి'' అని పేర్కొనడం గమనార్హం. 'షియాన్‌ యాంగ్ హాంగ్‌ 03' కదలికల్ని నిశితంగా గమనిస్తున్నట్లు భారత నేవీ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. గతంలో ఇదే తరహా నౌకలు శ్రీలంక తీరంలో కార్యకలాపాలు నిర్వహించడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నౌకలు సైనిక- పౌర ప్రయోజనాలకు సంబంధించినవి కావని ఆరోపించింది. ఇవి భారత్‌లో కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాలు, గగన తలంపై నిఘా ఉంచగలవు. మన పోర్టులు, అణు కేంద్రాలపై కూడా ఓ కన్నేయగలవని తెలుస్తోంది.


Post a Comment

0Comments

Post a Comment (0)