సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాల వైపు ప్రజల మొగ్గు !

Telugu Lo Computer
0


రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ప్రధాని నరేంద్ర మోదీ మొదటిసారిగా స్పందించారు. ఓటు వేసిన నాలుగు రాష్ట్రాల ప్రజలకు సెల్యూట్ అంటూ సందేశం ఇచ్చారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ఫలితాలు భారత ప్రజలకు సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలపై మాత్రమే విశ్వాసం ఉన్నాయని, వారి విశ్వాసం బీజేపీపైనే ఉందని చూపిస్తున్నాయన్నారు. భారతీయ జనతా పార్టీపై తమ ప్రేమ, విశ్వాసం, ఆశీర్వాదాలను కురిపించినందుకు అన్ని రాష్ట్రాల కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు, మన యువ ఓటర్లకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ప్రధాని మోడీ అన్నారు. మీ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇస్తున్నానంటూ సోషల్ మీడియా ట్విట్టర్ X వేదికగా పేర్కొన్నారు. "ఈ సందర్భంగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు! మీరందరూ అద్భుతమైన పని తీరును కనబర్చారు. బీజేపీ పార్టీ అభివృద్ధి, పేద సంక్షేమ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు ఎంతగానో కొనియాడదనినది. అభివృద్ధి చెందిన భారతదేశమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. మనం ఆగాల్సిన అవసరం లేదు. అలసిపోకూడదు. మనం భారత్‌ను గెలిపించాలి. ఈ రోజు మనం కలిసి ఈ దిశలో ఒక బలమైన అడుగు వేశాము. అంటూ ట్వీట్ చేశారు. బీజేపీకి మద్దతిచ్చినందుకు తెలంగాణలోని సోదరీమణులకు ధన్యవాదాలు అని ప్రధాని మోడీ అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ మద్దతు పెరుగుతోంది. భవిష్యత్తులో కూడా ఈ ట్రెండ్ కొనసాగుతుంది. తెలంగాణతో ఉన్న అనుబంధం విడదీయరానిదని, ప్రజల కోసం పని చేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త కృషిని నేను అభినందిస్తున్నాను అంటూ పేర్కొన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)