పేదల సొమ్ము తిరిగి ఇస్తారా? ఇంటికి వెళ్తారా ?

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం నుంచి పశ్చిమ బెంగాల్‌కు రూ 1.15 లక్షల కోట్ల బకాయిలు రావల్సి ఉందని వాటిని వెంటనే చెల్లించాలని లేదా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమత బెనర్జీ డిమాండ్ చేశారు. అలీపుర్‌దువార్‌లో జరిగిన సభలో మమత బెనర్జీ మాట్లాడుతూ బకాయిల విషయాన్ని తాను ప్రధాని మోడీ దృష్టికి తీసుకువెళ్లుతున్నట్లు, తక్షణం ఆయన అపాయింట్మెంట్ కోరినట్లు వెల్లడించారు. ఇంత భారీ మొత్తంలో బకాయిలు పెండింగ్‌లో ఉండటం భావ్యమేనా అని ప్రశ్నించిన మమత , ఈ విషయాన్ని తాము ప్రజల వద్దకు తీసుకువెళ్లతానని చెప్పారు. పేదల సొమ్ము తిరిగి ఇస్తారా? ఇంటికి వెళ్తారా ? అనే నినాదంతో తాము ముందుకు సాగుతామని హెచ్చరించారు. ఈ నెల 18 నుంచి 20 మధ్యలో మోడీతో భేటీకి వీలుందని, ఈ మేరకు సమాచారం పంపించామని మమత తెలిపారు. తాను తన వెంట కొందరు ఎంపీలు ఢిల్లీకి వెళ్లుతున్నట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి దక్కాల్సిన పలు స్థాయిల బకాయిలు తొక్కిపెట్టి తమాషా చేస్తోందని, వీటిని ఎప్పటికప్పుడు సకాలంలో విడుదల చేయడం జరిగితే పేదలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు వీలుండేదని మమత తెలిపారు. రోజ్‌గార్ యోజన, హౌసింగ్, ప్రత్యేకించి జిఎస్‌టి ద్వారా రాష్ట్రానికి రావల్సిన వాటా అన్ని కలిపి భారీ మొత్తంలో బకాయిలు పేరుకుపొయ్యాయన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)