ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ చేతిలో సెల్ఫోన్ ఉంటుంది. విచ్చలవిడిగా ఫోన్ వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట అతిగా స్మార్ట్ఫోన్ వాడితే, నిద్ర దూరం కావడమే కాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మనం నిత్యం వాడే స్మార్ట్ఫోన్ నీలి కాంతిని విడుదల చేస్తుంది. ఫోన్ స్క్రీన్ నుంచి వచ్చే బ్లూ లైట్కి ఎక్కువ గురయితే నిద్రకు అంతరాయం ఏర్పడుతుంది. మీరు ఫోన్లో ఈ-మెయిల్స్ తనిఖీ చేయడం, సోషల్ మీడియా సైట్లను వీక్షించడం, గేమ్స్ ఆడడం లాంటివి చేస్తుంటే దృష్టంతా వాటిపైనే యాక్టివ్గా ఉంటుంది. దాంతో తగిన నిద్ర పోవడానికి అవకాశం ఉండదు. ఇది నిద్ర లేకుండా చేయడమే కాదు, నిద్రలో కూడా ఇది ఇబ్బంది కలిగిస్తుందట. ప్రశాంతంగా ఉండేవారికి త్వరగానే నిద్ర వచ్చేస్తుంది. ఒత్తిడిలో ఉండే వారికే.. సరిగా నిద్ర రాదు. ఇలాంటి వారు ఫోన్తో కాలక్షేపం చేస్తుంటారు. దీంతో.. నిద్ర మరింత దూరమవుతుంది. ఫలితంగా.. అప్పటికే ఉన్న ఒత్తిడి స్థాయి మరింత పెరుగుతుంది. మరీ ముఖ్యంగా.. సోషల్ మీడియాలో ఎవరితోనైనా చాట్ చేస్తున్నా.. ఏదైనా నెగెటివ్ అంశంపై డిస్కస్ చేస్తున్నా.. మీ మెదడుపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. ఇది నిరంతరం కొనసాగితే మానసిక సమస్యగా మారే అవకాశమూ ఉంటుంది. ఎక్కువసేపు స్మార్ట్ఫోన్ని ఉపయోగించినప్పుడు కళ్లు అలసిపోతాయి. మరీ ముఖ్యంగా నైట్ లైట్లు ఆఫ్ చేసి.. ఫోన్ చూస్తున్నట్టయితే.. కళ్లకు మరింత పని పెట్టినవారవుతారు. దీంతో ఫోన్ స్క్రీన్ నుంచి బ్రైట్గా కనిపించే ఆ బ్లూ లైట్ చూస్తూ.. కళ్లు పగటివేళ కంటే ఎక్కువగా పనిచేయాల్సి ఉంటుంది. దీంతో.. కళ్లపై మరింత ప్రెజర్ పెరుగుతుంది. ఫలితంగా కళ్లు పొడిబారడం, దురద, మంట, ఎర్రబడడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ సమస్యలు లాంగ్ టైమ్ కొనసాగితే చాలా ఇబ్బందులు వస్తాయి.
నిద్రను దూరం చేస్తున్న సెల్ఫోన్ !
December 17, 2023
0
Tags