ఆధార్‌తో పాన్‌కార్డులు లింక్‌ చేయకాపోతే డియాక్టివేట్‌ కావు !

Telugu Lo Computer
0


పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయని వారి పాన్ కార్డులను డియాక్టివేట్ చేస్తున్నారా అని రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. జూన్ 30 వరకు 54,67,74,649 పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసినట్లు తెలిపారు. ఏ పాన్ కార్డును డీయాక్టివేట్ చేయలేదని చెప్పారు. ఒకవేళ పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ కేవలం పని చేయదని, కానీ డీయాక్టివేట్‌ కాదని స్పష్టం చేశారు. పాన్, ఆధార్ లింక్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం 2023 జూన్ 30ని గడువుగా ఇచ్చింది. దీని తర్వాత ప్రజలు రూ.1000 జరిమానా చెల్లించి పాన్, ఆధార్‌లను లింక్ చేస్తున్నారు. పాన్‌తో ఆధార్‌ను లింక్ చేయడం చాలా ముఖ్యం. లేకపోతే బ్యాంకుకు సంబంధించి ఎలాంటి లావాదేవీలు, ట్యాక్స్‌కు సంబంధించి ఎలాంటి పనులు చేసుకోలేరని తెలిపారు. అంతేకాకుండా పాన్‌ను ఆధార్‌కు లింక్ చేయకుండా ప్రభుత్వ పథకాలను పొందలేరని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)