మహాదేవ్ యాప్ బెట్టింగ్ కుంభకోణంలో రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల తర్వాత పారిశ్రామికవేత్తలు - డాబర్ గ్రూప్ ఛైర్మన్ మోహిత్ వి. బర్మన్, డైరెక్టర్ గౌరవ్ వి. బర్మన్ పేర్లు కూడా ముంబై పోలీసుల విచారణలో ఉన్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. నవంబర్ 7న ముంబై పోలీసులు నమోదు చేసిన బెట్టింగ్ యాప్ ఎఫ్ఐఆర్లో ప్రముఖ ఆయుర్వేద దిగ్గజం డాబర్ గ్రూప్కు చెందిన బర్మన్ ల పేర్లు చేర్చబడ్డాయి. బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్తో పాటు ఇతర వ్యక్తులతో సహా మొత్తం 31 మంది నిందితులలో వీరూ ఉన్నారు. డాబర్ గ్రూప్ దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. అధికారులెవరూ దీనిపై మాట్లాడేందుకు అందుబాటులో లేరు. బెట్టింగ్ యాప్ ద్వారా వేలాది మందిని రూ. 15వేలకు కోట్లకు పైగా మోసం చేశారని సామాజిక కార్యకర్త ప్రకాష్ బంకర్ మాతుంగా పోలీసులకు మొదటి ఫిర్యాదు చేశారు. గ్యాంబ్లింగ్ చట్టం, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద పోలీసులు ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది పేర్లు బయటకు వస్తున్నప్పటికీ ఇంకా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది.
మహాదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంలో మోహిత్, గౌరవ్ బర్మన్ పేర్లు ?
November 14, 2023
0
Tags