రిలయన్స్ జియో హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఎయిర్ఫైబర్ సర్వీసులను వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు నగరాల్లో ఎయిర్ ఫైబర్ సర్వీసులను విస్తరించిన జియో.. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సరికొత్త హోమ్ ఎంటర్టైన్మెంట్, స్మార్ట్ హోమ్ సర్వీసులు, హై-స్పీడ్ బ్రాడ్బ్యాండ్కు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ ఎండ్-టు-ఎండ్ సొల్యూషన్ ఎయిర్ఫైబర్ సర్వీసులను విస్తరించినట్టు ప్రకటించింది. ఇప్పటివరకూ ఆప్టికల్-ఫైబర్ను విస్తరించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ప్రతి మారుమూల ప్రాంతాల్లోని ఇల్లు, చిన్నవ్యాపారులకు నాణ్యమైన హోమ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా జియోఎయిర్ఫైబర్ సర్వీసులను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని 45 నగరాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నగరాల్లోని అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు ఇప్పుడు ప్రపంచ స్థాయి లేటెస్ట్ హోమ్ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్బ్యాండ్, డిజిటల్ ఎక్స్పీరియన్స్ సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా పొందవచ్చు. ఈ నగరాలన్నింటిలో కస్టమర్ల ప్రాంగణంలోనే అనేక జియో ఎయిర్ఫైబర్ కనెక్షన్లను ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా జియో ఆంధ్రప్రదేశ్ ఈఓఎం మహేష్ కుమార్ మాట్లాడుతూ.. జియోఎయిర్ఫైబర్ సర్వీసులు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి విస్తరిస్తోందని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఇళ్లు, వ్యాపార సంస్థలు ప్రపంచ స్థాయి లేటెస్ట్ హోమ్ ఎంటర్టైన్మెంట్, బ్రాడ్బ్యాండ్, డిజిటల్ అనుభవాన్ని సింగిల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ ద్వారా పొందవచ్చునని చెప్పారు. ఏపీలో జియోఎయిర్ఫైబర్ విస్తరణతో రాష్ట్ర యువతకు అత్యాధునిక కనెక్టివిటీ పరిష్కారాలను అందించడంలో సాయపడుతుందని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో జియో ఎయిర్ఫైబర్ సర్వీసుల విస్తరణ !
November 27, 2023
0
Tags