ఎరుపు రంగు అరటి పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఎర్రటి అరటిపండును క్రమం తప్పకుండా 21 రోజుల పాటు తీసుకుంటే శరీరంలో అనేక మార్పులు వస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. దీనిని తినడం వల్ల చర్మం ఎర్రబడటం, పొడిబారడం, దద్దుర్లు, సోరియాసిస్ వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయవచ్చు. కంటి ,శుక్లాల సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. దీనిని రోజూ తింటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి సంతానోత్పత్తి పెరుగుతుంది. అంతేకాకుండా, అంగస్తంభన సమస్య కూడా దూరమై, లైంగిక శక్తి పెరుగుతుంది. ఎర్రటి అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి. నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధితో బాధపడేవారు రోజూ అరటిపండు తింటే ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. పొటాషియం పుష్కలంగా ఉండటంవల్ల ఈ పండును రెగ్యులర్ గా తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.
ఎర్ర అరటి పండు - ఆరోగ్య ప్రయోజనాలు !
November 17, 2023
0
Tags