రాజస్థాన్ బిజెపి అభ్యర్థుల మూడో జాబితా విడుదల

Telugu Lo Computer
0


ఈనెల 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా గురువారం విడుదలైంది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌పై పోటీకి సర్దార్‌పుర అసెంబ్లీ స్థానం నుంచి మహేంద్ర సింగ్ రాథోర్‌ను నిలబెట్టింది. మాజీ డిప్యూటీ సిఎం సచిన్‌పైలట్‌పై టోంక్ స్థానం నుంచి అజిత్‌సింగ్ మెహతా పోటీకి నిలబడ్డారు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉన్న హవామహల్ స్థానం నుంచి బాలముకంద ఆచార్య బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. అంతకు మందు బీజేపీ రాజస్థాన్ లో రెండు జాబితాల్లో మొత్తం 124 మంది అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 200 స్థానాలకు గాను ఇంతవరకు 182 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)