సీనియర్‌ నటుడు ఈశ్వరరావు మృతి

Telugu Lo Computer
0


సీనియర్‌ నటుడు ఈశ్వరరావు కన్ను మూశారు. మిచిగాన్‌లోని తన కూతురు ఇంటికి వెళ్లిన ఆయన అనారోగ్య కారణంగా అక్టోబర్‌ 31న మృతి చెందారు. ఆయన స్వర్గం నరకం చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాడు. దాసరి నారాయణరావు దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ సూపర్‌హిట్‌గా నిలిచింది. తన కెరీర్‌లో దాదాపు 200కు పైగా చిత్రాల్లో నటించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. తొలి సినిమా స్వర్గం నరకం హిట్‌ అందుకున్న ఆయన కాంస్య నంది అవార్డును అందుకున్నారు. ఆ తర్వాత దేవతలారా దీవించండి, ప్రేమాభిషేకం, యుగపురుషుడు, దయామయుడు, ఘరానా మొగుడు, ప్రెసిడెంట్‌ గారి అబ్బాయి, జయం మనదే, శభాష్‌ గోపి వంటి విజయవంతమైన చిత్రాల్లో ఈశ్వరరావు నటించారు. చివరిసారిగా చిరంజీవి, నగ్మా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో కనిపించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)