కూలిన నిర్మాణంలో వున్న సొరంగం !

Telugu Lo Computer
0


త్తరాఖండ్ లోని ఉత్తర కాశీ జిల్లాలో నిర్మాణ దశలో ఉన్న ఓ సొరంగంలోని కొంతభాగం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆ సొరంగంలో పని చేస్తున్న 40 మంది చిక్కుకుని వున్నట్టు సమాచారం. వీరి పరిస్థితి ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు.  ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. యమునోత్రి జాతీయ రహదారిలో భాగంగా నిర్మాణ దశలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోయింది. ఉత్తర కాశీ జిల్లలోని సిల్క్యారా నుంచి దండల్ గావ్ వరకు ఉన్న యమునోత్రి జాతీయ రహదారిలో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దాదాపు 40 మంది చిక్కుకున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నాయి. ఎసీఆర్ఎఫ్, పోలీసు, రెవెన్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి. ఉత్తరకాశీ జిల్లా డీఎం, ఎస్పీ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే ప్రాణనష్టానికి అవకాశం లేదని కొట్టిపారేయలేమని అధికారులు పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)