చెల్లిలి మృత దేహాన్ని బైక్ పై తీసుకెళ్లిన అన్న!

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని ఔరయాలోని బిధునా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో బుధవారం ఉదయం ఓ వ్యక్తి తన సోదరి మృతదేహాన్ని బైక్ పై ఉంచుతూ విలపిస్తున్నాడు. నీళ్లు వేడి చేసుకునేందుకు హీటర్ పెట్టిన ఓ యువతి ప్రమాదవ శాత్తు విద్యుత్ ఘాతానికి గురయింది. ఆ యువతిని వెంటనే బిధువా కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించగా.. అప్పటికే చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. అయినప్పటికీ ఆ యువతి సోదరుడు మాత్రం ఆశ కోల్పోలేదు. వెంటనే మరో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించాడు. కానీ ఆస్పత్రిలో అంబులెన్స్ లేకపోవడంతో చనిపోయిన చెల్లెలి మృతదేహాన్ని మరో ఆస్పత్రికి తరలించేందుకు బైక్ పై తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ సమయంలో ఆ యువకుడి రోదనలు చూసే వారిని కన్నీళ్లు పెట్టించాయి. ఉత్తరప్రదేశ్ లో ఆరోగ్య వ్యవస్థ అధ్వాన్నం గా ఉందని తెలిపే సాక్ష్యం ఈ వీడియో. ప్రజలు తమ చనిపోయిన లేదా అనారోగ్యంతో ఉన్న బంధువులను బైక్ లపై లేదా కూరగాయల బండ్లపై తీసుకెళ్తున్న సంఘటన లు చాలానే వెలుగు చూశాయి. యూపీలో అంబెలెన్స్ ల సంక్షోభాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి అంటూ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ప్రతిపక్ష కాంగ్రెస్ నేత ఒకరు షేర్ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యూపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)