సిమెంట్‌ లారీ బోల్తా పడి ఐదుగురు కార్మికులు దుర్మరణం

Telugu Lo Computer
0


డిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించారు. సిమెంట్‌ రవాణా చేస్తున్న లారీ 12 మంది కార్మికులతో చిత్రకొండ నుంచి జోడంబాకు వెళ్తున్నది. శనివారం స్వాభిమాన్ అంచల్ ప్రాంతంలోని హంతలగూడ ఘాట్ వద్ద ఆ లారీ బోల్తాకొట్టింది. ఆ లారీపై ప్రయాణించిన 12 మంది కార్మికులు సిమెంట్‌ బస్తాల మధ్య చిక్కుకున్నారు. కాగా, ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సిమెంట్‌ బస్తాలను తొలగించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మిగతా కార్మికులను జోడంబాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చనిపోయిన ఐదుగురు కార్మికుల మృతదేహాలను కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)