నీతా అంబానీ తాగే టీ కప్పు ధర రూ. 3 లక్షలు !

Telugu Lo Computer
0

ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ ఆస్థి నికర విలువ 3 బిలియన్ డాలర్లు. అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 250 కోట్లు. ముఖేష్ నీతా అంబానీ ఫ్యామిలీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు యాంటిలియాలో నివసిస్తున్నారు. ఈ ఇంటి ధర 15 వేల కోట్ల రూపాయలు. సహజంగానే ముఖేష్ ఫ్యామిలీ జీవనశైలి కూడా ఖరీదైనది. నీతా అంబానీ రోజు ఒక కప్పు టీతో మొదలవుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టీ ధర సంగతి పక్కన పెడితే టీ ని తయారు చేసే తాగేందుకు ఉపయోగించే టీ కప్పు ధర తెలిస్తే  సామాన్య ప్రజలు తమ జీవితం ఆ డబ్బుతో గడిపేస్తాం అని అనుకుంటారు. నీతా అంబానీ తాను ధరించే బట్టలు, వస్తువులు, ఉపకరణాల విషయంలో వ్యక్తిగత ప్రాధాన్యత ఇస్తుంది. అదే విధంగా తాను ఉపయోగించే పాత్రల విషయంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తాను ఉపయోగించే పాత్రలంటే కూడా చాలా ఇష్టం. నీతా అంబానీ రోజూ ఉదయం టీ తాగేందుకు ఉపయోగించే టీ-సెట్ ధర 1.5 కోట్లు. ఒక కప్పు ఖరీదు రూ. 3 లక్షలు. దేశంలోని చాలా మంది ప్రజల సంవత్సర ఆదాయంకంటే ఎక్కువ ఈ టీ కప్పు ధర ఎక్కువ. నీతా అంబానీ ఉపయోగించే ఈ టీ -సెట్ జపాన్ నుండి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లోని పురాతన క్రోకరీ కంపెనీ నోరిటెక్ ఈ కప్పుల సెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సిరామిక్ కప్పుపై బంగారం, ప్లాటినం పూత తో డిజైన్ చేసి ఉంటుంది. ఈ టీ-సెట్ ధర మొత్తం ధర రూ.1.5 కోట్లు.

Post a Comment

0Comments

Post a Comment (0)